టీ బిజినెస్ స్టార్ట్ చేసిన టేస్టీ తేజ...
on May 7, 2024
బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. బిగ్ బాస్ లోకి వెళ్లిన చాలా మంది సినిమాల్లో బిజీ అయ్యారు. కొంతమంది వెబ్ సిరీస్ చేస్తూ ఉండగా కొందరు బిజినెస్ లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా టేస్టీ తేజ రీసెంట్ గా కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఫుడ్ వ్లాగర్గా కెరీర్ని ప్రారంభించాడు తేజ. తేజ ఫుడ్ ప్రొమోషన్స్ తో పాటు మూవీ ప్రొమోషన్స్ తో చేస్తూ యూట్యూబ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వీడియోస్ ద్వారానే బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీతో అందరినీ అలరించాడు. ప్రియాంక జైన్ ని పెళ్లి చేస్తుకుంటానంతో పరాచికాలు ఆడుతూ ఎంటర్టైన్ చేసాడు. శోభా శెట్టితో బాగా కనెక్ట్ అయ్యాడు. కానీ ఇద్దరికీ వాళ్ళ వాళ్ళ ఫియాన్సీస్ ఉండేసరికి బాబు కాస్త తగ్గాడు. ఇక బిగ్ బాస్ నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఏదేమైనా ఆడియన్స్ నుంచి తేజ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ పాపులారిటీతో ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాడు. అదే టీ బిజినెస్. ఇప్పుడు ఫ్రాంఛైజీ టీ బిజినెస్ బాగా నడుస్తోంది. దీంతో `ఇరానీ నవాబ్ టీ` పేరుతో ఫ్రాంఛైజీ టీ బిజినెస్ని స్టార్ట్ చేసాడు టేస్టీ తేజ. కార్పొరేట్ స్టయిల్లో స్టార్ట్ చేసిన ఈ టీ బిజినెస్ ని బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరో శివాజీ గెస్ట్ గా వచ్చి దాన్ని స్టార్ట్ చేసాడు. తేజ బిజినెస్ బాగుండాలంటూ శివాజీ తన బెస్ట్ విషెస్ని అందించాడు. తేజ ఏం చేసినా ప్లానింగ్తో, ముందుచూపుతో చేస్తాడని, ఈ బిజినెస్ ద్వారా మంచి డబ్బులు రావాలని, వస్తాయని కోరుకున్నాడు. ఈ షాప్ ఓపెనింగ్ సెరెమనిలో బిగ్ బాస్ టీమ్ అమర్ దీప్, శుభ శ్రీ, ప్రియాంక జైన్ కూడా పాల్గొన్నారు.
Also Read